ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: యనమల
ABN , First Publish Date - 2021-10-18T01:11:21+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో అప్పు ఎంత చేశారో...సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని టీడీపీ
తుని: వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో అప్పు ఎంత చేశారో...సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో అన్నిరంగాల్లో వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదని విమర్శించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తున్నానని చెప్పారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీయడంతోపాటు అప్పులు చేసి, అభివృద్ధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ నెలకు 2వేల కోట్లు అప్పు చేసి సంక్షేమానికి ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.