మల్లారెడ్డి ఆస్పత్రిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: ఎన్ఎస్యూఐ
ABN , First Publish Date - 2021-05-14T09:09:35+05:30 IST
అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి ఆస్ప త్రి భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచిత కరోనా వైద్య కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ డిమాండ్ చేశారు
హైదరాబాద్, మే 13(ఆంధ్రజ్యోతి): అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి ఆస్ప త్రి భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచిత కరోనా వైద్య కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ డిమాండ్ చేశారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీ డియాతో మాట్లాడారు. డాక్టర్లపై తాను దాడిచేసినట్లు చెబుతున్న మల్లారెడ్డి యాజమాన్యం, ఆ వీడియోలను మీడియాకు సమర్పించాలన్నారు. ఆయన అక్రమ ఆస్తుల వివరాలను ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించారు.