అభివృద్ధ్దే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కృషి
ABN , First Publish Date - 2021-04-19T05:52:55+05:30 IST
అభివృద్ధ్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు.
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్, ఏప్రిల్ 18: అభివృద్ధ్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. సబ్ప్లాన్ కింద మంజూరైన రూ.17 లక్షల నిదులతో ఆదివారం జహీరాబాద్లోని బాగారెడ్డిపల్లిలో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కృషిచేస్తుందని చెప్పారు. ఏడు సంవత్సరాల కాలంగా జహీరాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండిమోహన్, నామ రవికిరణ్, ముత్యాలచందు, యాకూబ్, తులసీదాస్, బాబీ, రాకేష్, రాజు, శివప్ప, ప్రవీణ్, సంగ్రాం, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.