లాక్డౌన్ 4పై ప్రజల సూచనలు.. కేంద్రానికి పంపిన సర్కారు!
ABN , First Publish Date - 2020-05-16T01:36:43+05:30 IST
లాక్డౌన్ 4పై ప్రజల నుంచి సేకరించిన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
న్యూఢిల్లీ: లాక్డౌన్ 4పై ప్రజల నుంచి సేకరించిన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన మేరకు లాక్డౌన్ 4పై ప్రభుత్వానికి ప్రజల నుంచి 4లక్షలపైగా సూచనలు అందినట్లు సమాచారం. వీటిలో ఎంపిక చేసిన వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు జైన్ వెల్లడించారు. పరిమిత స్థాయిలో బస్సులు, మెట్రోలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే 25-50% మాల్స్ తెరవచ్చని, సరి-బేసి విధానంలో దుకాణాలకు అనుమతులివ్వాలని ప్రజలు సూచించారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలని చెప్పారు.