పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ తోడ్పాటు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-18T05:04:42+05:30 IST

నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.

పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ తోడ్పాటు : ఎమ్మెల్యే
కొత్త ఫీడర్‌ ఛానల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, జూన్‌ 17 : నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిఽధిలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌ పార్కు సబ్‌స్టేషన్‌ నుంచి ఆయా గ్రామాలకోసం ఏర్పాటుచేసిన ఫీడర్‌ ఛానల్‌ను ప్రారంభించి మాట్లాడారు. సమైఖ్య రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలో విద్యుత్‌ ఉత్పత్తిలో చరిత్ర సృష్టించామని తెలిపారు. విద్యుత్‌ కోతలు లేని నిరంతర సరఫరాతో పరిశ్రమలు లాభాల బాటలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ ఈర్ల దేవానందం, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:04:42+05:30 IST