నర్సంపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-19T13:48:46+05:30 IST

వరంగల్ రూరల్: నర్సంపేట పట్టణం వరమ్మతోట కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నర్సంపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

వరంగల్ రూరల్: నర్సంపేట పట్టణం వరమ్మతోట కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం గాడిపెళ్లి గ్రామానికి చెందిన లింగమూర్తి(48) ఖానాపూర్ మండలం బుధరావుపేటలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఇతని సోదరుడు నవీన్ ఆకస్మిక మరణంతో వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులతో పాటు తల్లి సోదరి వలన తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మృతుడు సూసైడ్ నోట్ పెట్టి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-19T13:48:46+05:30 IST