ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు: సజ్జల

ABN , First Publish Date - 2021-10-11T20:22:31+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరాజు దుయ్యబట్టారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు: సజ్జల

అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరాజు దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని రాజకీయ శక్తులు వికృత చర్యలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థలను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ఏపీలో 5 కోట్ల జనాభా ఉంటే ఇళ్లు లేనివారు 31 లక్షల మంది ఉన్నారని తెలిపారు. పేదల సొంతింటి కలను టీడీపీ అడ్డుకుంటోందని, సీఎం జగన్‌కు ప్రజాదరణ చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-10-11T20:22:31+05:30 IST