శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్
ABN , First Publish Date - 2021-04-22T06:28:00+05:30 IST
తిరుమల వేంకటేశ్వరుడిని బుధవారం తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ దర్శించుకున్నారు.
తిరుమల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరుడిని బుధవారం తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీడీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే భన్వరీలాల్ పురోహిత్ శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన స్నపన తిరుమంజన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.