కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కృష్ణాష్టమి జరుపుకోవాలి-గవర్నర్
ABN , First Publish Date - 2021-08-30T21:59:44+05:30 IST
అంకితభావం, సమయపాలన వంటివి భగవాన్ శ్రీకృష్ణుడిని చూసి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు
హైదరాబాద్: అంకితభావం, సమయపాలన వంటివి భగవాన్ శ్రీకృష్ణుడిని చూసి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిస్వార్ధం, అంకితభావంతో చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుందనడానికి భగవాన్ శ్రీకృష్ణుడు నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి బోధనలను ఆచరించి ఉత్తమ పౌరులుగా ఉండాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.