దేశీయ ఉత్పత్తులతోనే దీపావళి జరుపుకోండి:గవర్నర్

ABN , First Publish Date - 2021-11-03T22:32:48+05:30 IST

ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ప్రజలు దీపావళి పండగను దేశీయ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.

దేశీయ ఉత్పత్తులతోనే దీపావళి జరుపుకోండి:గవర్నర్

హైదరాబాద్: ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ప్రజలు దీపావళి పండగను దేశీయ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. దీపావళి పండగ సందర్బంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు గ్రీటింగ్స్ చెప్పారు. దీపావళి పండగ చెడుపై మంచి సాధించిన విజయంగా, విజయానికి ప్రతీక దీపావళి పండగ అని అన్నారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా బాణాసంచా కాల్చేప్పుడు తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-11-03T22:32:48+05:30 IST