HYD: చింతల్బస్తీలో గవర్నర్ తమిళిసై పర్యటన
ABN , First Publish Date - 2021-12-29T17:27:54+05:30 IST
నగరంలోని చింతల్బస్తీలో గవర్నర్ తమిళిసై బుధవారం ఉదయం పర్యటించారు.
హైదరాబాద్: నగరంలోని చింతల్బస్తీలో గవర్నర్ తమిళిసై బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ను తమిళిసై సందర్శించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వందశాతం తొలిడోసు పూర్తి కావడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి కేంద్రం అవసరమైన డోసులు పంపిణీ చేసిందని తెలిపారు. 2022 ఆరోగ్య సంవత్సరంగా సాగాలని కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.