నిస్వార్థ సేవకుడు నేతాజీ

ABN , First Publish Date - 2022-01-24T08:51:46+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

నిస్వార్థ సేవకుడు నేతాజీ

బోస్‌కు ఘనంగా నివాళులర్పించిన గవర్నర్‌

అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం పరాక్రమ్‌ దివా్‌సను నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబో్‌సకు గవర్నర్‌ ఘనంగా నివాళులు ఆర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజమైన జాతీయవాదిగా దేశం పట్ల ఆయనకున్న ప్రేమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిదన్నారు. ఇప్పటికీ దేశ ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారన్నారు. 

Updated Date - 2022-01-24T08:51:46+05:30 IST