కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలం : నిమ్మల

ABN , First Publish Date - 2021-05-06T07:52:14+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలం : నిమ్మల
వైద్యాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామానాయుడు

పాలకొల్లు టౌన్‌, మే 5 : కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు  ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని, పట్టణంలోని కోవిడ్‌  ఆసుపత్రులను   సందర్శించారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్‌ చేయించారు. శానిటైజర్లు కూడా లేని ఆసుపత్రి సిబ్బందికి పూర్తిస్థాయిలో శానిటైజరులు అందచేయాలని అధికారులకు సూచించారు. బెడ్స్‌, ఆక్సిజన్‌ లేక ఆసుపత్రుల బయట రోగులను పరామర్శించారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోవాలని కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్లను ఫోన్‌లో కోరారు.  కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ గీతా కుమారి, నోడల్‌ ఆఫీసర్లు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T07:52:14+05:30 IST