తెలంగాణలో మాస్క్ తప్పనిసరి.. లేకుంటే రూ. 1000 జరిమానా
ABN , First Publish Date - 2021-04-11T21:50:23+05:30 IST
కోవిడ్-19 వ్యాప్తి పెరిగిపోతున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: కోవిడ్-19 వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానాతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్యాక్ట్-2005, ఐపీసీ సెక్షన్ 188, 51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు అవసరమైన అధికారాలను ఇచ్చింది. జీవోను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు.