1.6 మిలియన్ల మంది పన్ను చెల్లింపుదారులకు రూ. 26,000 కోట్లు వెనక్కి!

ABN , First Publish Date - 2020-05-23T01:06:40+05:30 IST

ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1.6 మిలియన్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 26,242

1.6 మిలియన్ల మంది పన్ను చెల్లింపుదారులకు రూ. 26,000 కోట్లు వెనక్కి!

న్యూఢిల్లీ: ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1.6 మిలియన్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 26,242 కోట్లను వెనక్కి ఇచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) తెలిపింది. రిఫండ్స్‌ను వేగవంతం చేయడం, పన్ను చెల్లింపుదారుల ద్రవ్యలభ్యతను మెరుగు పరిచే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు రూ. 14,632 కోట్లు, కార్పొరేట్లకు రూ. 11,610 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది. ఫలితంగా 1.5 మిలియన్ల మందికిపైగా వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు, 1,02,392 మంది కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగినట్టు సీబీడీటీ తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ద్రవ్యతను మెరుగు పరిచేందుకు ట్యాక్స్ రిఫండ్‌ను క్లియర్ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 

Updated Date - 2020-05-23T01:06:40+05:30 IST