‘పీఎం కేర్స్‌’కు గూగుల్‌ పే కస్టమర్ల విరాళం రూ.124 కోట్లు

ABN , First Publish Date - 2020-07-14T06:25:02+05:30 IST

పీఎం కేర్స్‌ నిధికి గూగుల్‌ పే యాప్‌ వినియోగదారులు రూ.124 కోట్ల విరాళం ఇచ్చి నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఈ నిధుల బదిలీకి సం బంధించి వివిధ వర్గాలకు చెందిన వారు 22 లక్షలకు పైగా లావాదేవీలు జరిపినట్లు...

‘పీఎం కేర్స్‌’కు గూగుల్‌ పే కస్టమర్ల విరాళం రూ.124 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 13: పీఎం కేర్స్‌ నిధికి గూగుల్‌ పే యాప్‌ వినియోగదారులు రూ.124 కోట్ల విరాళం ఇచ్చి నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఈ నిధుల బదిలీకి సం బంధించి వివిధ వర్గాలకు చెందిన వారు 22 లక్షలకు పైగా లావాదేవీలు జరిపినట్లు గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, వైస్‌ప్రెసిడెంట్‌ సంజయ్‌గుప్తా తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ పీఎం కేర్స్‌ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-14T06:25:02+05:30 IST