‘ధాన్యం తరలించిన డబ్బు ఇవ్వాల్సిందే’

ABN , First Publish Date - 2021-06-18T05:32:45+05:30 IST

కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు సకాలంలో కాంట్రాక్టర్‌ వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులే స్వయంగా ట్రాక్టర్లలో మిల్లుకు తరలించారు.

‘ధాన్యం తరలించిన డబ్బు ఇవ్వాల్సిందే’
సివిల్‌ సప్లై గోదాం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

నర్సాపూర్‌, జూన్‌ 17: కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు సకాలంలో కాంట్రాక్టర్‌ వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులే స్వయంగా ట్రాక్టర్లలో మిల్లుకు తరలించారు. ఇప్పటి వరకు వాటికి సంబంధించిన డబ్బులు రాలేదని పలువురు రైతులు నర్సాపూర్‌ సివిల్‌ సప్లైగోదాం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గురువారం గోదాం వద్ద డబ్బులు ఇస్తామని తెలపడంతో కౌడిపల్లి మండలం తుంకి, అజ్జమర్రి, కంచన్‌పల్లి తదితర గ్రామాల నుంచి పలువురు రైతులు వచ్చినా,  ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. నెలరోజులు గడిచినా తమ డబ్బులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా వారు విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు.   

Updated Date - 2021-06-18T05:32:45+05:30 IST