సచివాలయంలో మద్యం తాగిన ఇద్దరు గ్రామ వాలంటీర్లపై వేటు

ABN , First Publish Date - 2020-08-02T03:30:08+05:30 IST

సచివాలయంలో మద్యం తాగిన ఇద్దరు గ్రామ వాలంటీర్లపై వేటు

సచివాలయంలో మద్యం తాగిన ఇద్దరు గ్రామ వాలంటీర్లపై వేటు

తిరుపతి: తిరుపతి రూరల్ మంగళం బీటీ ఆర్ కాలనీలోని సచివాలయంలో 29న ఇద్దరు గ్రామ వాలంటీర్లు మద్యం తాగారు. గ్రామ వాలంటీర్ల వ్యవహారాన్ని తోటి వాలంటీర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వాలంటీర్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినట్లు పంచాయతీ కార్యదర్శి సురేందర్రావు తెలిపారు. వాలంటీర్లు రెడ్డప్ప, ఢిల్లీ బాబును విధుల నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.


Updated Date - 2020-08-02T03:30:08+05:30 IST