ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-07-25T05:53:05+05:30 IST

ఐటీ, పురపాలకశాఖ మం త్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను గోదావరిఖనిలో ఘ నంగా నిర్వహించారు.

ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు
గోదావరిఖనిలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే చందర్‌

- ‘ఖని’లో యువకులతో ఎమ్మెల్యే కవాతు

గోదావరిఖని, జూలై 24: ఐటీ, పురపాలకశాఖ మం త్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను గోదావరిఖనిలో ఘ నంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్యాన్సర్‌ రోగులకు పెన్షన్లను అందజేశా రు. గోదావరిఖని ఫైవింక్లయిన్‌ నుంచి మున్సిపల్‌ టీ జంక్షన్‌ వరకు యువకులతో కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువకులు పెద్దఎత్తున హాజర య్యారు. అమ్మపరివార్‌ ఆశ్రమంలో పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇటీవల వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ని త్యావసర వస్తువులను పంపిణీ చేశారు. హనుమాన్‌న గర్‌లో పేద మహిళ రేవత్మకు ఇల్లు నిర్మించి సదరు మహిళతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత హైదరాబాద్‌కు అనేక ఐటీ కంపెనీలను తీసుకువచ్చి యువతీ యువకులకు ఉపా ధి కల్పించిన ఘనత కేసీఆర్‌దన్నారు. ఈ కార్యక్రమం లో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, పాముకుం ట్ల భాస్కర్‌, కొమ్ము వేణుగోపాల్‌, ఐత శివకుమార్‌, బా లరాజ్‌కుమార్‌, మేకల సదానందం, ఇంజపురి పులేంద ర్‌, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-25T05:53:05+05:30 IST