ప్రగతిభవన్‌లో ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-13T09:48:29+05:30 IST

రక్షా బంధన్‌ వేడుకలు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి.

ప్రగతిభవన్‌లో ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు  

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రక్షా బంధన్‌ వేడుకలు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమ ఆప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిశాయి. సోదరీమణుల రాకతో ముఖ్యమంత్రి నివాసంలో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్‌, ఆయన సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు  అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్‌ వేడుకలు జరుపుకొన్నారు. తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్‌ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే మంత్రి కె.తారకరామారావుకు ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి కవితతో ఉన్న బాల్యం నాటి చిత్రాన్ని, తన కుమారుడు, కుమార్తె చిన్ననాటి చిత్రాలను మంత్రి ఈ సందర్భంగా ట్విటర్‌లో పంచుకున్నారు. కొన్ని బంధాలు ప్రత్యేకం.. అంటూ వాటిని షేర్‌ చేశారు.

Updated Date - 2022-08-13T09:48:29+05:30 IST