పవన్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు

ABN , First Publish Date - 2021-10-02T20:36:10+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

పవన్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు

ఏలూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలకు పవన్ విఘాతం కల్గిస్తున్నారని తప్పుబట్టారు. సమాజంలో అశాంతి శక్తులను ప్రోత్సహించేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గాడ్సేను పూజిస్తున్న పార్టీలతో పవన్‌ పొత్తుపెట్టుకుని, గాంధీ శాంతియుత మార్గాన్ని తుంగలోకి తొక్కుతున్నారని దుయ్యబట్టారు. అసత్యాలని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-02T20:36:10+05:30 IST