ఘాటెక్కిన ఉల్లి
ABN , First Publish Date - 2020-10-22T06:49:59+05:30 IST
ఉల్లి ధర ఘాటెక్కింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉల్లి పంట తీవ్రంగా నష్టాల పాలై హైదరాబాద్కు దిగుబడి తగ్గడంతో విపరీతంగా డిమాండ్ పెరిగింది.
కిలో రూ.100
ఎర్రగడ్డ/న్యూఢిల్లీ, అక్టోబర్ 21 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధర ఘాటెక్కింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉల్లి పంట తీవ్రంగా నష్టాల పాలై హైదరాబాద్కు దిగుబడి తగ్గడంతో విపరీతంగా డిమాండ్ పెరిగింది. రెండు రోజుల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో రూ.24 ఉన్న ఉల్లిధర ఇపుడు వంద రూపాయలకు చేరింది.
రైతుబజార్లలో బుధవారానికి రూ.84కు చేరింది. వర్షాలవల్ల ఎక్కువశాతం ఉల్లిగడ్డలు కుళ్లిపోయాయని, దిగుబడి తగ్గిందని ఎర్రగడ్డ రైతుబజార్ ఎస్టేట్ అధికారి రమేశ్ తెలిపారు.అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం వల్ల ధరలు అమాంతం పెరిగాయని అన్నారు.
కాగా, ఉల్లి దిగుమతులపై డిసెంబరు 15 వరకు నిబంధనలను సడలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో పెరిగిపోయిన ఉల్లి ధరలను దీని ద్వారా నియంత్రించే ప్రయత్నం చేయాలని సర్కారు భావిస్తోంది.