మహనీయుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T05:36:41+05:30 IST

తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటడం కోసం టీడీపీని స్థాపించి, 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి, సంక్షేమానికి ఆద్యం పోసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

మహనీయుడు ఎన్టీఆర్‌
బిక్కవోలు: పందలపాకలో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న రామకృష్ణారెడ్డి

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 
  • తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి వర్ధంతి
  • నివాళులర్పించిన పలువురు నాయకులు

బిక్కవోలు, జనవరి 18: తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటడం కోసం టీడీపీని స్థాపించి, 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి, సంక్షేమానికి ఆద్యం పోసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని జిల్లాలో పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బిక్కవోలు మండలంలో పందలపాక, తొస్సిపూడి, ఊలపల్లి గ్రామాల్లోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు. కార్యక్రమంలో పందలపాక సర్పంచ్‌ సబ్బారపు పద్మావతి, సూర్యనాయణ, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, పడాల సూర్యనారాయణరెడ్డి, నాయకులు గుణ్ణం శ్రీనివాసచౌదరి, కర్రి శ్రీనివాసరావు, దత్తుడు, అనుసూరి నాగేశ్వరరావుపాల్గొన్నారు. బిక్కవోలులో పాలచర్ల శివప్రసాద్‌చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి జంపా వెంకటరమణ, మండల సెల్‌ అధ్యక్షుడు రాయుడు రామచంద్రరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి డేగల అభిరామ్‌, వైదాడి వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:36:41+05:30 IST