ఈ-శ్రమ్‌ కార్డులతో ఎంతో ఉపయోగం

ABN , First Publish Date - 2022-01-28T04:56:16+05:30 IST

ఈ-శ్రమ్‌ కార్డులతో ఎంతో ఉపయోగం

ఈ-శ్రమ్‌ కార్డులతో ఎంతో ఉపయోగం
ఈ-శ్రమ్‌ కార్డులు పంపిణీ చేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి

కులకచర్ల, జనవరి 27 : ఈ-శ్రమ్‌ కార్డులు కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహార్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్‌ గ్రామంలో ప్రజలకు ఈ-శ్రమ్‌ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. జన్‌సాహస్‌ స్వచ్భంద సంస్థ శ్రామికులకు ఈ-శ్రమ్‌ కార్డులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో జన్‌ సాహస్‌ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్‌ ప్రకాశ్‌కుమార్‌, సర్పంచ్‌ వెంకటమ్మచిన్నయ్యయాదవ్‌, ఎంపీటీసీ రాంలాల్‌నాయక్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:56:16+05:30 IST