రేపే గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-12-03T20:07:24+05:30 IST

డిసెంబర్ 1న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది

రేపే గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: డిసెంబర్ 1న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 


ఏర్పాట్లు ఇలా..

సాధారణ ఓట్ల లెక్కింపు కోసం  మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150  హాల్స్ ఏర్పాటు. ఒక్కో హాల్‌కి 14 టేబుల్స్  ఉంటాయి. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152  మంది. 31 మంది కౌంటింగ్ పరిశీలకులు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్‌కు సీసీటీవీల ఏర్పాటు.  


ఒక్కో రౌండ్‌కి 14000 వేల ఓట్లు లెక్కింపు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావల్సి ఉంటుంది. ప్రతి టేబుల్ దగ్గర  సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్‌లను కౌంట్ చేస్తారు. 


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు. 74 లక్షల 67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 15 లక్షల 90 వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Updated Date - 2020-12-03T20:07:24+05:30 IST