గ్రేటర్ ఎన్నికల్లో భర్త డబుల్.. భార్య ట్రిఫుల్ ధమాకా
ABN , First Publish Date - 2020-12-05T16:05:13+05:30 IST
భార్యాభర్తలు డబుల్... ట్రిఫుల్ ధమాకా సాధించారు.
హైదరాబాద్/మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భార్యాభర్తలు డబుల్... ట్రిఫుల్ ధమాకా సాధించారు. హఫీజ్పేట నుంచి పూజిత జగదీశ్వర్గౌడ్ రెండో సారి గెలిచి డబుల్ ధమాకా పొందగా.. ఆమె భర్త జగదీశ్వర్గౌడ్ మూడోసారి మాదాపూర్ డివిజన్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన జగదీశ్వర్గౌడ్, ఆ తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
హఫీజ్పేట, మాదాపూర్ డివిజన్లో తిరుగులేని మెజార్టీతో భార్యభర్తలు విజయం సాధించి ప్రజల్లో వారికున్న బలాన్ని చాటుకున్నారు. మాదాపూర్ డివిజన్ నుంచి జగదీశ్వర్గౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణయాదవ్పై 6905 ఓట్ల మెజార్టీ, హఫీజ్పేట డివిజన్ నుంచి పూజిత జదీశ్వర్గౌడ్ తన సమీప బీజేపీ అభ్యర్థి అనూషా మహే్షయాదవ్పై 5,189 ఓట్ల మెజార్టీతో గెలుపొంది విజయకేతనం ఎగురవేశారు.