జీసీసీ కమిషనర్‌గా గగన్‌దీప్‌సింగ్‌ బేదీ

ABN , First Publish Date - 2021-05-10T14:58:31+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) కమిషనర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గగన్‌దీప్‌సింగ్‌ బేదీ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ డాక్టర్‌ ..

జీసీసీ కమిషనర్‌గా గగన్‌దీప్‌సింగ్‌ బేదీ

చెన్నై/ప్యారీస్: గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) కమిషనర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గగన్‌దీప్‌సింగ్‌ బేదీ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ డాక్టర్‌ ప్రకాష్‌ స్థానంలో ఆయన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ శాఖల్లో మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా మదురై కార్పొరేషన్‌ కమిషనర్‌గా వ్యవహరించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గగన్‌దీప్‌సింగ్‌ బేదీని జీసీసీకి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణాభివృద్ధి శాఖలో విశేష అను భవం కలిగిన గగన్‌దీప్‌సింగ్‌ బేదీ గత పదేళ్లలో సంభవించిన తుఫాను, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సకాలంలో నివారణ సహాయం అందేలా కృషిచేశారు.

Updated Date - 2021-05-10T14:58:31+05:30 IST