ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

ABN , First Publish Date - 2020-07-02T10:42:35+05:30 IST

జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో లయన్స్‌క్లబ్‌ వివిధ శాఖల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరుపుకున్నా

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

మంచిర్యాల టౌన్‌/అర్బన్‌ జూలై 1: జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో లయన్స్‌క్లబ్‌ వివిధ శాఖల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరుపుకున్నా రు. జిల్లాలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యులు కుమారస్వా మి, ప్రశాంత్‌, అలివేణి, ప్రశాంతి, కళావతిని రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, కమిటి సభ్యులు మధుసూధన్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి, ఎడ్ల కిషన్‌ పాల్గొన్నారు. గౌతమీనగర్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వ ర్యంలో వైద్యులు రాజేంధర్‌, చరణ్‌, వెంకటరెడ్డి, అలీ, రాజేష్‌లను జ్ఞాపికలు అందజే సి, సన్మానించారు. క్లబ్‌ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్‌, సెక్రటరీ రాజేంధర్‌, కోశాధికారి నరే ష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ పాల్గొన్నారు.


అలాగే హైటెక్‌సిటీ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్యులు రమేష్‌, కోటేశ్వర్‌, ప్రత్యూష, గణేష్‌, రవిని ఘనంగా సన్మానించారు. ప్రోగ్రాం చైర్మన్‌ వెంకటయ్య, 29వ వార్డు కౌన్సిలర్‌ చైతన్య సత్యపాల్‌రెడ్డి, క్లబ్‌ అధ్యక్షుడు నా మని రమేష్‌, కార్యదర్శి మడుపు రామ్‌ప్రకాష్‌, కోశాధికారి సతీష్‌గౌడ్‌, తదితరులు పా ల్గొన్నారు. వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో వైద్యులు గోలి శృతి, రామకృష్ణ, విక్రమ్‌తోపాటు చా ర్టెడ్‌ అకౌంటెంట్‌ సూర్య ప్రకాష్‌లను ఘనంగా సన్మానించారు. క్లబ్‌ చైర్మన్‌ రమేష్‌, అధ్యక్షుడు సతీష్‌, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, కోశాధికారి ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

 

మందమర్రి: మందమర్రి ఏరియాలోని కేకే-1 డిస్పెన్సరీలో ఉత్తమ డాక్టర్‌ శ్రీ నివాస్‌ను, తోటి డాక్టర్లు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. బుధవారం డిస్పెన్సరీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యాక్రమానికి డివైసిఎంవో రామల శౌరి పాల్గొని ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను అందచేసి శాలువతో సన్మానించారు. డాక్టర్లు మహి పాల్‌, జగదీష్‌, శ్రీనివాస్‌, శైలజా, మధుసూదన్‌, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు.


కాసిపేట: మండల కేంద్రంలో లయన్స్‌క్లబ్‌, ముత్యంపల్లి సర్పంచు ఆడె బాదు ఆధ్వర్యంలో కాసిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ కిరణ్మయిని శాలు వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్ర మంలో ఉపసర్పంచ్‌ బోయిని తిరుపతి, సోమగూడెం లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు తీర్ధాల భా స్కర్‌, దూడం మహేష్‌, దినేష్‌, వెంకటరమణ, కృష్ణ,  తిరుపతి పాల్గొన్నారు. 


బెల్లంపల్లిటౌన్‌: బెల్లంపల్లి సింగరేణి లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో బుధవారం  బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సంతోష్‌సింగ్‌ ఠాకూర్‌, బోనగిరి నరేష్‌ గుప్త, చార్టెడ్‌ అకౌంటెంట్‌ కొడిప్యాక సాయినాథ్‌లను బెల్లంపల్లి సింగరేణి లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు పెద్ది రాజేందర్‌, జోన్‌ చైర్మన్‌ డీకొండ రాజలిం గులు ఘనంగా శాల్వపూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ 320 జీ జిల్లా కోఆర్డీనేటర్లు వంగళ చక్ర పాణి,  రేణికుంట్ల శ్రీనివాస్‌, జిల్లా చైర్మన్‌ నలుమాస సంతోష్‌, ఫాస్ట్‌ ప్రెసిడెంట్‌ కొడిప్యాక శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T10:42:35+05:30 IST