హరితహారం.. అపహాస్యం

ABN , First Publish Date - 2021-06-15T07:15:48+05:30 IST

ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది.

హరితహారం.. అపహాస్యం
వంగపల్లి–రాయిగిరి మార్గమధ్యలో రోడ్డు పక్కన ఎండిపోయిన హరితహారం మొక్కలు

ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా  అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది. జిల్లాలోని రాయగిరి–వంగపల్లి గ్రామాల మధ్య వరంగల్‌ హైవేకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటారు. మిగిలిన వందలాది మొక్కలను నిర్లక్ష్యంగా పడివేయడంతో అవి ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.  మొక్కలు సక్రమంగా నాటించ డంతో పాటు వాటిని సంరక్షించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌, యాదాద్రి



Updated Date - 2021-06-15T07:15:48+05:30 IST