గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణ ఆపాలి

ABN , First Publish Date - 2020-08-05T10:53:04+05:30 IST

పంట భూములను నాశనం చేసే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణ పనులు అపాలని గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి భూ పోరాట కమిటీ ..

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణ ఆపాలి

విజయనగరం దాసన్నపేట : పంట భూములను నాశనం చేసే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణ పనులు అపాలని గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి భూ పోరాట కమిటీ కన్వీనర్‌ రాంబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ప్ల కార్డులతో నిరసన  చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు వేయడం జిల్లా ప్రజలకు మేలు కన్నా, నష్టం అధికంగా ఉందన్నారు. జిల్లాలో తొమ్మిది మండలాల్లోని సుమారు 55 గ్రామాల్లోని రైతులు పంట భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అల్లు రవి, బండారు పెదబాబు, కేకే స్వామినాయుడు, గంగునాయుడు, సత్యారావు, కరక శ్రీను, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-05T10:53:04+05:30 IST