హీటెక్కిస్తున్న గుడివాడ కేసినో వ్యవహారం

ABN , First Publish Date - 2022-01-23T22:36:35+05:30 IST

గుడివాడ కేసినో వ్యవహారం హీటెక్కిస్తోంది. కేసినోలో పాల్గొన్న చీర్ గర్ల్స్ ప్రయాణ వివరాలను టీడీపీ నేత వర్ల రామయ్య బయటపెట్టారు.

హీటెక్కిస్తున్న గుడివాడ కేసినో వ్యవహారం

అమరావతి: గుడివాడ కేసినో వ్యవహారం హీటెక్కిస్తోంది. కేసినోలో పాల్గొన్న చీర్ గర్ల్స్ ప్రయాణ వివరాలను టీడీపీ నేత వర్ల రామయ్య బయటపెట్టారు. మొత్తం 13 మంది ఇండిగో ద్వారా ప్రయాణించారని తెలిపారు. గన్నవరం నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి గోవా వెళ్లే ప్రయాణికుల వివరాలను వర్ల రామయ్య మీడియాకు వెల్లడించారు. గోవా నుంచి విజయవాడ వచ్చిన వారి వివరాలు పోలీసులు సేకరించాలని, నార్త్ ఇండియాకు చెందిన మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. కేసినోకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వర్ల రామయ్య నిలదీశారు.


గుడివాడలో కేసినో నిర్వహించింది నూటికి నూరు శాతం వాస్తవం. ఈ కేసినోకు సాక్షాత్తు మంత్రి కొడాలి నాని కే కన్వెన్షన్‌ వేదికగా నిలవడం అంతకన్నా వాస్తవం. గుడివాడలో కేసినో నిర్వహించిన ఏసెస్‌ కేసినో సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీల్లో ఫొటోలతో సహా ఇదే విషయం పేర్కొంది. ఇన్ని ఆధారాలు నాని మాటలను తప్పని నిరూపిస్తుంటే మంత్రి మాత్రం తన అనుచరులతో.. ఎడ్ల పందేలు నిర్వహించుకుంటే కేసినో నిర్వహించారని దుష్ప్రచారం చేస్తారా అంటూ ప్రెస్‌మీట్లు పెట్టిస్తుండటంపై గుడివాడ జనం ముక్కున వేలేసుకుంటున్నారు


Updated Date - 2022-01-23T22:36:35+05:30 IST