వారాంతాల్లో కర్ఫ్యూ విధించండి : గుజరాత్ హైకోర్టు
ABN , First Publish Date - 2021-04-06T22:04:48+05:30 IST
కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల మూడు, నాలుగు రోజులపాటు
అహ్మదాబాద్ : కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల మూడు, నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుజరాత్ హైకోర్టు కోరింది. రాష్ట్రంలో అష్టదిగ్బంధనం విధించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వారాంతంలో కర్ఫ్యూ విధించడంపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో భారీ రాజకీయ సమావేశాలు, ఇతర వేడుకల నిర్వహణను నిలిపేయాలని ప్రభుత్వాధికారులను ఆదేశించింది.
కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6న దాదాపు 97 వేల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 1.26 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కొత్త ఆంక్షలను విధించాయి.