వ్యాక్సిన్ కోసం పడిగాపులు...పత్తాలేని అధికారులు

ABN , First Publish Date - 2021-05-10T15:55:27+05:30 IST

జిల్లాలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. నేటి నుండి ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ వేస్తామని అధికారులు ప్రకటించారు.

వ్యాక్సిన్ కోసం పడిగాపులు...పత్తాలేని అధికారులు

గుంటూరు: జిల్లాలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. నేటి నుండి ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ వేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ఉదయాన్నే వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలు తరలివచ్చారు. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి  ప్రజలు పడిగాపులు కాస్తున్నా...అధికారులు పత్తాలేకుండాపోయారు. మధ్యాహ్నం 12గంటల తరువాత లోక్‌డౌన్ అని చెప్పారని... ఇంక ఎప్పుడు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సినేషన్ వేయడం కుదరదని చెబితే వచ్చే వాళ్ళం కాదు అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-05-10T15:55:27+05:30 IST