అరండల్పేట స్టేషన్లో మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-05-12T17:58:29+05:30 IST
మంత్రి శీదిరి అప్పలరాజుపై అరండల్ పేట స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది.
గుంటూరు: మంత్రి సీదిరి అప్పలరాజుపై అరండల్ పేట స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రాష్ట్రంలో ఎన్440కే వైరస్ విజృంభిస్తుందని ప్రచారం చేశారని... మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారని, తప్పుడు ప్రచారం చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ అరండల్ పేట సీఐకు బొంగలరాలబీడు చెందిన దేవదాసు కాలే ఫిర్యాదు అందజేశారు. దేవదాసుకు టీడీపీ నేతలు శ్రావణ కుమార్, కోవెలమూడి రవీంద్ర, కనపర్తి, చిట్టిబాబు, మానుకొండ మద్దతు తెలిపారు.