గుంటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-05-13T15:19:16+05:30 IST

జిల్లాలోని చిలకలూరిపేట శ్రీనివాస రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు.

గుంటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట శ్రీనివాస రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దాదాపు 440 బస్తాల రేషన్ బియాన్ని పట్టుకున్నారు. ఓ లారీ, ఓ మినీ లారీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-05-13T15:19:16+05:30 IST