పల్నాడు జిల్లా ప్రకటించే వరకు పోరాడుతాం: యరపతినేని

ABN , First Publish Date - 2020-11-22T18:53:35+05:30 IST

చరిత్ర కలిగిన గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని డిమాండ్ చేశారు.

పల్నాడు జిల్లా ప్రకటించే వరకు పోరాడుతాం: యరపతినేని

గుంటూరు: చరిత్ర కలిగిన గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పల్నాడును తొలి నుంచి కరివేపాకులా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గురజాలకు ఎన్నో వనరులు ఉన్నాయని తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వైసీపీ వినహా అన్ని రాజకీయ పార్టీలు గురజాల జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. పల్నాడు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. రేపు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సంకల్ప దీక్ష చేయనున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని యరపతినేని తేల్చిచెప్పారు. 


Updated Date - 2020-11-22T18:53:35+05:30 IST