‘పంట నష్ట పరిహారం రైతుల అకౌంట్లలో పడుతుంది’
ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST
‘పంట నష్ట పరిహారం రైతుల అకౌంట్లలో పడుతుంది’
గుంటూరు: తుపాను వల్ల జిల్లాలో 1.33 లక్షల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. ముందస్తు చర్యలతో 35 వేల హెక్టర్లలోని వరి పంటను కాపాడగలిగామన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పంట నష్టంపై అంచనాలు వేస్తున్నారని చెప్పారు. రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈనెల చివరి వరకు నష్ట పరిహారం రైతుల అకౌంట్లలో పడుతుందన్నారు.