చిలకలూరిపేట పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-03-06T16:54:08+05:30 IST
టీడీపీ నేత పిల్లి కోటి అరెస్ట్పై ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ పిల్లి కోటి అరెస్ట్పై ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చిలకలూరిపేట పోలీసు స్టేషన్కు వెళ్లిన పిల్లి మాణిక్య రావు....పిల్లి కోటిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో స్టేషన్ వద్ద పోలీసులకు, పిల్లి మాణిక్యరావు లకు మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తక్షణమే పిల్లి కోటీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో చిలకలూరిపేట పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే కారణంతో అర్ధరాత్రి పిల్లి కోటిని ఆయన ఇంటికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.