నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద కేఆర్ఎమ్బీ టీమ్ పర్యటన
ABN , First Publish Date - 2021-11-15T19:26:25+05:30 IST
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద కేఆర్ఎంబీ టీమ్ సోమవారం పర్యటించింది.
గుంటూరు: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద కేఆర్ఎంబీ టీమ్ సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువను కేఆర్ఎంబీ సబ్ కమిటీ కన్వినర్ కే ఆర్.పిల్లై పరిశీలించారు. కాగా సబ్ కమిటీని సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కలిసి.. సాగు కుడి కాలువ రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కృష్ణ నదిపై తెలంగాణ నిర్మించే అక్రమ పాజెక్టులు నిలుపుదల చేయాలని, ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులు కాపాడాలని సాగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణా రావు వినతి చేశారు.