Guntur: రోడ్డుపై ధాన్యం పోసి రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-28T16:36:36+05:30 IST

జిల్లాలోని పొన్నూరు మండలం మునిపల్లెలో రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు.

Guntur: రోడ్డుపై ధాన్యం పోసి రైతుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం మునిపల్లెలో రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై వరి ధాన్యం పోసి వరి రైతులు ధర్నా చేపట్టారు. రైతుల పండించిన వరి ధాన్యం అంతా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని దూళిపాళ్ల  డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-12-28T16:36:36+05:30 IST