Guntur: పీఆర్సీకి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మిక సంఘాల పోరాటం

ABN , First Publish Date - 2022-01-11T17:30:54+05:30 IST

పీఆర్సీకి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నారు.

Guntur: పీఆర్సీకి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మిక సంఘాల పోరాటం

గుంటూరు: పీఆర్సీకి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్క్సర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు. పిఆర్సీ వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒరిగిందేమి లేదన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ కుక్కకు బిస్కెట్లు వేసినట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. కోడిని వేలాడి దీసి అందరిని పలావు తినమన్నట్లుగా పీఆర్సీ ఉందని యెద్దేవా చేశారు. జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేరవేర్చాలని మధుబాబు డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-11T17:30:54+05:30 IST