టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసు నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-14T19:15:59+05:30 IST

జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యకేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసు నిందితుల అరెస్ట్

గుంటూరు: జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మరికాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 


నిన్న గుండ్లపాడులో గ్రామ సెంట‌ర్‌లో చంద్రయ్య కూర్చున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. చంద్రయ్యను హత్య చేసిన తర్వాత దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ హత్య అని అన్నారు. పోరాడే వాళ్లని హత్యా రాజకీయాలతో బయపెడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. చంద్రయ్య అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు పాడెను మోసారు. 



Updated Date - 2022-01-14T19:15:59+05:30 IST