Gunturలో యాసిడ్ దాడి
ABN , First Publish Date - 2022-01-07T13:50:36+05:30 IST
జిల్లాలోని గురజాల మండలం మాడుగులలో దారుణం జరిగింది. గత రాత్రి ఇంట్లో ఉన్న మహిళాపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు.
గుంటూరు: జిల్లాలోని గురజాల మండలం మాడుగులలో దారుణం జరిగింది. గత రాత్రి ఇంట్లో ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఓ వ్యక్తి... మహిళ ఇంటి వద్దకు వచ్చి మంచి నీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్లు ఇచ్చేందుకు వచ్చిన మహిళపై ఆ వ్యక్తి యాసిడ్ పోశాడు. కాగా ఈ ఘటనకు మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలిని కుటుంబసభ్యులు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.