65,194 మందికి వ్యాక్సిన్ తొలి డోస్
ABN , First Publish Date - 2021-03-09T15:22:14+05:30 IST
జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు 65,194 మందికి కోవిడ్-19 వ్యా క్సిన్ తొలి డోస్ వేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్..
గుంటూరు: జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు 65,194 మందికి కోవిడ్-19 వ్యా క్సిన్ తొలి డోస్ వేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం 97 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో హెల్త్వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు 1,429 మంది, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు 1,568 మంది వ్యాక్సిన్ వేయించుకొన్నారు. అలానే రెండో డోస్ని 1,161 మంది వే యించుకొన్నారు. దీంతో రెండో డోస్ వేయించుకొన్న వారి సంఖ్య 15,234కి చేరింది.