కక్షకట్టి నా కొడుకుని చంపేశారు: శివశ్రీ తల్లి

ABN , First Publish Date - 2021-08-24T05:30:00+05:30 IST

శివశ్రీ అనే మహిళ సోదరుడు అనిల్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనిపై ..

కక్షకట్టి నా కొడుకుని చంపేశారు: శివశ్రీ తల్లి

తాడేపల్లి: సీఎం జగన్ ఇంటి వెనుక స్థలాల ఆక్రమణల తొలగింపు ఆందోళనలో పాల్గొన్న శివశ్రీ అనే మహిళ సోదరుడు అనిల్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనిపై స్పందించిన శివశ్రీ తల్లి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన కొడుకు బాగానే ఉన్నాడని, ఎలాంటి అనారోగ్యం లేదని, స్థలాల గొడవలో తన కొడుకును పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారని, తర్వాత చనిపోయాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. తన కొడుకుది సహజ మరణం కాదని, కుట్ర చేసి చంపేశారంది. తనకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె అని ఆమె తెలిపింది. స్థలం విషయంలో తన కుమార్తె శివశ్రీ కూడా పోరాటం చేసిందన్నారు. తన కొడుకు మృత దేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకువచ్చారని, ఎవరో కావాలనే కక్షకట్టి తన కొడుకును చంపేశారని ఆమె కన్నీటిపర్యమంతమైంది.

Updated Date - 2021-08-24T05:30:00+05:30 IST