వైసీపీ మోసం చేసిందంటూ.. వినుకొండ నియోజకవర్గంలో ఫ్లెక్సీ కలకలం

ABN , First Publish Date - 2021-12-14T21:16:21+05:30 IST

వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది.

వైసీపీ మోసం చేసిందంటూ.. వినుకొండ నియోజకవర్గంలో ఫ్లెక్సీ కలకలం

గుంటూరు జిల్లా: వైసీపీ తమను మోసం చేసిందంటూ గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఈపూరు మండలం, ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో ఈ ఫ్లెక్సీ వెలసింది. మోసపోయిన వైసీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎస్సీలను ఎన్నికలలో ఓట్ల కోసం వాడుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశారన్నారు. అవమానించిన వారికి తగిన రీతిలో జవాబు చెబుతామని, వైసీపీ నేతలు తమ కాలనీ జోలికి వస్తే గాడిదలతో సమానంగా ఆడవాళ్లతో బుద్ది చెబుతామని ఆ ఫ్లెక్సీలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2021-12-14T21:16:21+05:30 IST