గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-04-16T20:14:05+05:30 IST

గుంటూరు జిల్లా: ముప్పాళ్ళ మండలం, చాగంటి వారి పాలెంలో ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా: ముప్పాళ్ళ మండలం, చాగంటి వారి పాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో సీపీఎం కార్యకర్త సుందరయ్యపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. నిందితుడు వైసీపీ సర్పంచ్ మోర్తల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని సీపీఎం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాలీగా లంకేలకూరపాడు బయలు దేరిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - 2021-04-16T20:14:05+05:30 IST