వినుకొండ మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు

ABN , First Publish Date - 2021-07-27T17:46:30+05:30 IST

వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

వినుకొండ మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు

గుంటూరు జిల్లా: వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చెత్తపై పన్ను విధింపుకు నిరసనగా మంగళవారం ఆందోళనకు పిలుపు ఇచ్చారు. మరోవైపు నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిరసనలు, ఆందోళనలు చేయడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై ఆంజనేయులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడం సరికాదన్నారు.

Updated Date - 2021-07-27T17:46:30+05:30 IST