గుంటూరు: మాజీ సైనికుని కుటుంబం ఆందోళన

ABN , First Publish Date - 2021-01-10T15:25:45+05:30 IST

మాజీ సైనికుడు నంది భీమప్ప కుటుంబం ఆందోళనకు దిగింది.

గుంటూరు: మాజీ సైనికుని కుటుంబం ఆందోళన

గుంటూరు జిల్లా: తాడేపల్లి మండలం, గుండిమెడ కరకట్ట వద్ద మాజీ సైనికుడు నంది భీమప్ప కుటుంబం ఆందోళనకు దిగింది. తన భర్తకు కేంద్ర ప్రభుత్వం సైనికుడు కోటాలో ఇచ్చిన ఎకరం 80 సెంట్లు వ్యవసాయ భూమిని ఇరిగేషన్ శాఖ, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ భూమిలో మాజీ సైనికుని ఫోటోతో నిరసనకు దిగారు. వారికి మద్దతుగా మాజీ సైనిక వెల్ఫేర్ సభ్యులు ఆదివారం నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై అధికార యంత్రాంగం ఇంతవరకు స్పందించలేదు.

Updated Date - 2021-01-10T15:25:45+05:30 IST