టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ఏడుగురి అరెస్టు..

ABN , First Publish Date - 2021-10-26T20:01:00+05:30 IST

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ఏడుగురి అరెస్టు..

గుంటూరు: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. దర్యాప్తు ఆధారంగా మిగతా నిందితులను గుర్తిస్తామన్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అయితే పోలీసుల ప్రకటనలు అయోమయానికి గురిచేస్తున్నాయని టీడీపీ నేతలంటున్నారు. ఈ కేసులో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ పుటేజి పరిశీలించారు. ఇప్పటి వరకు 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ప్రకటించారు. మొదట 11 మంది. రెండోసారి ఆరుగురు, తాజాగా మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.


మరోవైపు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. వీడియోలలో గుర్తించినవారికి కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారంటున్నారు. పోలీసులు ఆర్భాటంగా ప్రకటనలు చేయడంపై టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బృందం ఢిల్లీ వెళ్లిన తరుణంలో పోలీసులు హడావుడి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-10-26T20:01:00+05:30 IST